జనసేన- గిరిసేన, జనం వద్దకు – జనసేన 37వ రోజు కార్యక్రమం

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం కి చెందిన గధబవలస గ్రామానికి జనసేన పార్టీ, తరుపున పర్యటన చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ, మత్స పుండరికం, కర్రీ కళ్యాణి, వావిలపల్లి భూషణ్, కర్నెన సాయి పవన్, దత్తి గోపాల్, రఘుమండల గణేష్, అనిల్, బొమ్మాళి వినోద్, దూసి సందీప్ పర్యటన చెయ్యడం జరిగింది. ఈ క్రమంలో జనసేన జానీ మాట్లాడుతూ వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు విస్తృతంగా పర్యటించి ప్రతి సమస్య తెలుసుకుని, ప్రజల పక్షాన నిలబడి అవి పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వం పై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. మత్స పుండరికం మాట్లాడుతూ ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ ఎలాంటి అధికారం లేకపోయినా ప్రజలుకి సమస్య ఎక్కడ ఉంటే అక్కడకు నేరుగా వెళ్ళిఆ సమస్యను పరిష్కరించి వారికి అండగా ఉంటున్నారు. జనసేన పార్టీ వీరమహిళ కర్రి కళ్యాణి మాట్లాడుతూ ప్రజలు సమస్యలుపైన ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ పనిచెయ్యడం లేదు ప్రయత్నం చెయ్యడం లేదు కానీ జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ మాత్రం జనవాహిని కార్యక్రమం పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సమస్యను తెలుసుకొని వాటిపైన గళం గొంతు ఎత్తుకొని అండగా నిలబడుతున్నారు. అలాంటి నాయుకుడిని ఖచ్చితంగా సీఎం చేసుకోవాలి అని విన్నవించుకోవడం జరిగింది. స్థానికులు మాట్లాడుతూ మా గ్రామం లో విపరీతమైన నీటి సమస్య ఉన్నది హాస్పిటల్ కి వెళ్ళాలంటే రహదారి లేదు అని చెప్పడం జరిగింది.