జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో గెడ్డం బుజ్జి పుట్టినరోజు వేడుకలు

పాయకరావుపేట: జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గెడ్డం బుజ్జి పుట్టినరోజు సందర్భంగా కోటవురట్ల జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7 గంటలకు కోటవురట్ల శివాలయములో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది, 9 గంటలకు కైలాసపట్నం చర్చిలో ఉన్న 70 మంది అనాధ పిల్లలు ఉదయం స్నాక్స్, టిఫిన్, పిల్లల సబ్బులు కోసం వెయ్యి రూపాయిలు ఇవ్వడం జరిగింది. తర్వాత కోటవురట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 50 మందికి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. అనంతరం నర్సీపట్నం నియోజకవర్గంలో పట్టణ నిరాశ్రయ ఆశ్రమములో 50 భోజనం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షులు జాజుల రమణ, కోటవురట్ల జనసేనపార్టీ మండల అధ్యక్షులు జవ్వాది బద్రి, బీసెట్టి రమణ, బోడపాటి రవికుమార్, బి పవన్, రామకృష్ణ, సంతోష్ కుమార్, మోహన్, పెట్టుగోళ్ళపల్లి శంకర్, మడుగుల కనకరాజు పాల్గొనడం జరిగింది.