మినుములూరు గ్రామంలో నందోలి మురళీకృష్ణ పర్యటన

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం, మినుములూరు గ్రామంలో పాడేరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందోలీ మురళీకృష్ణ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామస్తులు పలు సమస్యలను వివరించడం జరిగింది. ముఖ్యంగా కాఫీ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు వాపోయారు. అలాగే కొంతమందికి పింఛన్ నిలిపివేశారని, అలాగే మంచినీటి సమస్య ఉందని తెలియజేయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా మురళీకృష్ణ మాట్లాడుతూ జనసేన జనంలోకి బలంగా పనిచేయటానికి కృషి చేస్తుందని, అలాగే గ్రామస్తుల చెప్పిన సమస్యలను చి పై అధికారుల ద్రుష్టికి తీసుకెల్లి సమస్యలను పరిష్కరించేటట్లు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ పర్యటనలో మినుములూరి జనసైనికులు పవన్, కొండబాబు, సురేష్, ప్రసాద్, రమేష్, వీర మహిళలు, హుకుంపేట మండల జనసైనికులు రాజు తదితరులు పాల్గొన్నారు.