పుష్ప షూటింగ్ కు బ్రేక్.. యూనిట్ లో కరోనా కలకలం..
స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్ విలక్షణ పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కలకలంతో బ్రేక్ పడింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం తూర్పు మన్యంలో సాగుతున్న విషయం తెలిసిందే. అయితే చిత్ర యూనిట్కు చెందిన సభ్యుడొకరు అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందడం, తర్వాత యూనిట్లో పలువురికి వైద్య పరీక్షలు చేయగా కొవిడ్ లక్షణాలు కనిపించడంతో షూటింగ్ను నిలిపేశారని ప్రచారం జరుగుతోంది.