శుభమస్తు గ్రాండ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

విజయవాడ: శుభమస్తు గ్రాండ్ షాపింగ్ మాల్ లో లక్కీ డిప్ డ్రా కోసం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పోతిన మహేష్ మరియు జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు మరి న్యాయవాది ఎం.హనుమాన్ శుభమస్తు గ్రాండ్ కి విచ్చేసి విజేతలకు వారి చేతుల మీదగా స్కూటీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పండగలు మన రాష్ట్రంలో ఎన్నో జరుపుకోవాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతిరోజు పండగ లాగా కావాలని కోరుకుంటూ.. వైస్సార్సీపీ పార్టీ అధికారంలో ఉంటే ప్రజలు మనశ్శాంతి లేదని ప్రజలకు మనశ్శాంతి కావాలంటే మంచి ప్రభుత్వం అధికారం రావాలని మరోసారి తెలియజేశారు. శుభమస్తు గ్రాండ్ షాపింగ్ మాల్ బందర్ రోడ్ విజయవాడలో ఉన్న మేనేజ్మెంట్ కు మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసారు.