జనసైనికుడు గోవిందరాజును పరామర్శించిన మాకినీడి
పిఠాపురం నియోజకవర్గం, నరసింగపురంనకు చెందిన జనసైనికుడు గంజి గోవిందరాజు ఇటీవల బైక్ యాక్సిడెంట్ గురై కాలికి బలమైన గాయం అయ్యింది. ఈ క్రమంలో గోవిందరాజు కు కాకినాడ అహోబిల హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగింది. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి హాస్పిటల్ కి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకునీ, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరాది వల్లి రామకృష్ణ, బుర్ర సూర్య ప్రకాష్, కసిరెడ్డి నాగేశ్వరరావు, కంద సోమరాజు, పెంకే జగదీష్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-22-at-10.01.01-PM-1024x768.jpeg)