తణుకు జనసేన ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

  • జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతన్నల సమస్యలను తెలుసుకొన్న విడివాడ

తణుకు నియోజకవర్గం: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తణుకు నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గం, తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల గ్రామాల్లో రైతులను కలుసుకుని వారికి అంతర్జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, ఈ సందర్బంగా వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది.. ఈ క్రమంలో రైతులు తమకు సకాలంలో లారీలు రావడం లేదని, ధాన్యం డబ్బులు పడట్లేదని, తడిసిన ధాన్యానికి సరైన న్యాయం చేయట్లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, రైతులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.