రైతన్నల గోడు వినిపించుకోవడానికి మేడ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన రైతన్నలు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం వేదికగా రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించిన రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్. రైతన్నల ఆవేదన ఏంటో స్వయంగా వారి మాటల్లో తెలుసుకున్న గురుదత్ ప్రసాద్ మరియు రాష్ట్ర కార్యదర్శి గంట స్వరూప. సమస్యలన్నిటినీ అధిష్టానానికి ఒక నివేదిక తయారుచేసి, రైతులకు అండగా ఆ సమస్య తీరే విధంగా జనసేన పార్టీ తరఫున పోరాటం చేయడానికి సభాముఖంగా నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, రాజానగరం నియోజకవర్గం వీర మహిళ కందికట్ల అరుణ, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండల అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండల అధ్యక్షులు కరిచర్ల విజయ శంకర్, రాజానగరం జనసేన పార్టీ ఎంపిటిసి రమణ, మూడు మండల కమిటీ సభ్యులు,80 గ్రామాల గ్రామ కమిటీ సభ్యులు, జనసేన సానుభూతిపరులు, రైతులు, కవులు రైతులు, వీర మహిళలు మరియు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.