వీర జవాన్లకు కొవ్వొత్తులతో జనసేన నివాళులు

కాకినాడ సిటీ: వీర జవాన్ల త్యాగం చిరస్మరణీయమని.. వారికి కాకినాడ సిటీ జనసేన తరపున అశ్రునివాళులర్పించడం జరిగింది.. కాకినాడ సిటీ లోని రాజా ట్యాంకు వద్ద ఉన్న భారతమాత విగ్రహం వద్ద కాకినాడ సిటీ ఇంచార్జ్ పి.ఎ.సి మెంబర్ ముత్తా శశిధర్ సూచనల మేరకు కాకినాడ సిటి పార్టీ శ్రేణులు జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య ఆధ్వర్యంలో శనివారం సాయంకాలం కొవ్వొత్తుల ర్యాలీతో భారత జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిక్కిం రాష్ట్రంలో బస్సు ప్రమాదంలో అసువులుబాసిన భారత సైనికుల సేవలను మననం చేసుకుంటూ ఈ దేశం, భారత జాతి వారి సేవలను ఎన్నటికీ మరువదంటూ నివాళులు అర్పించారు. దేశ సేవలో భాగం పంచుకుంటూ దుర్ఘటనలో అమరులు అవ్వడం తీవ్ర దురదృష్టకరమని, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని పార్ధించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్షులు సంగిసెట్టి అశోక్, జనసేన పార్టీ రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, మనోహర్లాల్ గుప్తా, దుర్గాప్రసాద్, వీరబాబు, ఏసుబాబు, రవిశంకర్, పచ్చిపాల మధు, సురేష్, మల్లేశ్వరరావు, ధర్మారావు, చీకట్ల వాసు, షమీర్, కాశ్మీర్ ఖాన్ మరియు వీరమహిళలు హైమావతి, దారపు శిరీష, దుర్గ, వరలక్ష్మి, సాయి, అంజలి, లక్ష్మి, సావిత్రి, గోసి తదితరులు పాల్గొన్నారు.