క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జనసేన నాయకులు రేగిడి లక్ష్మణరావు
- జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ప్రత్యేక ప్రార్థనలు
విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం, మెరక ముడిదాం మండలం రేగిడి లక్ష్మణరావు జనసేన పార్టీ విజయనగరం జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి అధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. సత్యము, శాంతి, దయాగుణము, క్షమించే గుణం, ప్రపంచానికి చాటి చెప్పిన యేసయ్య పాపులను రక్షించడానికి వచ్చిన యేసయ్య, ఈ సందర్భంగా 2024లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ప్రార్థనలు చేయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, జనసేన పార్టీకి మెస్సయ్య ఆశీర్వాదం, కృప ఉండాలని ప్రార్థన చేయడం జరిగింది. అనంతరం కేకు కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-25-at-12.40.56-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-25-at-12.40.54-1024x576.jpeg)