మూగ, బధిర చిన్నారులకు క్రిస్మస్ సంబరాలను అందించిన డా. వడ్లపట్ల

దెందులూరు: చేసిన పాప కార్యాలని గ్రహించి పశ్చాత్తాపం చెందడం క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు” అని, అటువంటి పశ్చాత్తాపం అవసరం లేని పాపం ఎరుగుని మూగ, బధిర చిన్నారులతో కలిసి దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్న జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్. సంబరాలలో బాగంగా పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు ప్రధానం చేసి, క్రిస్మస్ కేక్ కోసి వారితో ఉల్లాసంగా గడిపారు.