వీరఘట్టం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి వర్ధంతి

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం కెంద్రంలో సోమవారం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల హక్కుల కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన మహోన్నతమైన నాయకుడు, పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగా 34వ వర్ధంతి సందర్భంగా పాలకొండ నియోజక వర్గం, వీరఘట్టం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా చిత్ర పటం వద్ద ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా గొప్ప పొరటయోధుడు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నేటికి ప్రజల హృదయాల్లో కొలువున్నారు, రంగాగారి ఆశయ సాధన జరిగేది జనసేన పార్టీతోనే సాధ్యమని జనసేన జానీ అన్నారు. మత్స పుండరీకం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహావ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని, కొంతమంది రాజకీయ లబ్ధికోసం రంగాగారిని హత్య చేయిఒచారు. ఇటువంటి మహనాయకుడిని స్మరించుకోని ఆయన ఆశయానికి అనుగుణంగా మనంకూడా అణగారిన వర్గాల ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వావిలపల్లి నాగభూషన్, కర్ణేన సాయి పవన్ దత్తి. గోపాల్, జనసైనికులు పాల్గొనడం జరిగింది.