సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కి వినతి పత్రం

చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కాపు శంభం గ్రామంలో గత కొంతకాలంగా చెత్త కాలువల్లో నిల్వ ఉండటం వలన గ్రామ ప్రజలు అనారోగ్యంతో బాధ పడుతున్నారు మరియు మంచి నీటి సమస్య ఉందని విషయం తెలుసుకొని కాపు శంభం గ్రామ జనసైనికులు బాకూరి శ్రీను, చందక బాల, ముల్లు జగదీష్, శ్రీరామ్, గణేష్, ప్రశాంత్, నాని, అశోక్ పంచాయతీ కార్యదర్శి కి మరియు గ్రామ సర్పంచ్ కి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.