నెహ్రూ యువ కేంద్ర వారి ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్

పార్వతీపురం: బలిజిపేట మండల హై స్కూల్ లో, కేంద్ర ప్రభుత్వం అనుబంధ సంస్థ నెహ్రూ యువకేంద్ర వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆ సంస్థ యొక్క ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు,ఆదినారాయణ ఎన్ పీ, పరుచూరి రమణ, ప్రగడ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాబు పాలురు మాట్లాడుతూ, చదువుతో పాటు స్పోర్ట్స్ లో కూడా నైపుణ్యం కలిగి ఉండాలని, ఆడపిల్లలు కూడా స్పోర్ట్స్ లో పాల్గొని మంచిగా రాణించాలని, ఇప్పుడు పిల్లలు అందరూ ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి చదువులని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, పిల్లలందరినీ కనీసం స్కూల్, కాలేజీ టైంలోనైనా గ్రౌండ్ కి రప్పించేలా అధ్యాపకులు శ్రద్ద చూపించాలని విఙ్నప్తి చేసారు. రానున్న 2రోజులు నిర్వహించబోయే ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొనబోయే విద్యార్థులందరికీ తమ బెస్ట్ విషెస్ అందజేసారు.