అగ్నిప్రమాద బాదితులకు అండగా నిలచిన ప్రత్తిపాడు జనసేన

ప్రత్తిపాడు నియోజకవర్గం, శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో దళితవాడలో అగ్నిప్రమాదంలో ఏడు ఇళ్ళు పూర్తిగా అగ్నికి ఆహుతి అవడం జరిగింది. విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు నెల్లిపూడి గ్రామానికి వెళ్లి అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ్మయ్యబాబు మాట్లాడుతూ.. ఇళ్ళు కోల్పోయిన బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని, అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి అగ్ని ప్రమాదంలో తమ నివాసాలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు జాప్యం చేయకుండా వెంటనే తక్షణసాయం అందించి ఇల్లు నిర్మించుకునేలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది మరియు బాధిత కుటుంబాలకు తమ్మయ్యబాబు ఆర్థిక సహాయాన్ని అందించటం జరిగింది, అలాగే జనసేన పార్టీ శ్రేణులు దుప్పట్లు, భోజనాలు, బియ్యం కూరగాయలు అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, నెల్లిపూడి గ్రామ నాయకులు బుజ్జి, ఏలేశ్వరం మండల పార్టీ అధ్యక్షులు పెంటకోట మోహన్, ఏలేశ్వరం మండల పార్టీ ఉపాధ్యక్షులు పలివేల వెంకటేష్, నియోజకవర్గ జనసేన యూత్ నాయకులు వరుపుల సాయికిరణ్, గోవిందు, నాగేశ్వరరావు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.