జనసేన అధ్వర్యంలో మత్తి వెంకటేశ్వరరావుకి ఘన సత్కారం

అవనిగడ్డ: ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఉత్తమ న్యాయవాది అవార్డు ఆల్ ఇండియా కాపు తెలగ బలిజ సంఘంచే ఆల్ ఇండియా స్థాయిలో కృష్ణాజిల్లా నుండి ప్రముఖ న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావు చేస్తున్న సేవలకు గుర్తింపు గా అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మత్తి వెంకటేశ్వరరావు ని మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షలు పూషడపు రత్నగోపాల్ అధ్యక్షతన మోపిదేవి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ మరియు మండల నాయకులు, జనసైనికులు మత్తి వెంకటేశ్వరరావు ని పూలదండలతో మరియు షాలువాలతో సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. వృత్తిలో నిజాయితీగా, ఉన్నత విలువలతో, ఎంత ఎదిగినా ఒదిగిఉండే స్వభావమే ఆయనకు అవార్డుతెచ్చిపెట్టింది అని పలువురు వక్తలు ఆయన గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, పూషడం గ్రామ సర్పంచ్ అంకెం మారుతీరావు, పెదకళ్ళేపల్లి ఎంపీటీసీ అరజా ఆషాదేవి, నాగాయలంక మండల పార్టీ అధ్యక్షులు చింతా వెంకటేశ్వరరావు అలాగే నియోకవర్గస్థాయి నాయకులు మరియు జనసేన మోపిదేవి మండల కమిటి సభ్యులు, మండల స్థాయి నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.