అర్హులందరికీ ఉచిత బియ్యం అందించండి.. తాసిల్దారుకు వినతి పత్రం

టెక్కలి నియోజకవర్గం, నందిగాం మండల పరిదిలోని పలు గ్రామాలలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న ఉచిత రాయితీ బియ్యం కొంతమంది లబ్ధిదారులకి అందడంలేదు, ఈ సమస్యతో ప్రతీ గ్రామంలోనూ 15 నుండి 20 కార్డుల వరకూ అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారి తరఫున ఈ సమస్యపై టెక్కలి జనసేన, బిజెపి పార్టీల ఆధ్వర్యంలో బుధవారం నందిగాం మండల ఎమ్మార్వో ఆఫీసులో డిప్యూటీ తాసిల్దారుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రతినిధి కూరాకుల యాదవ్, జనసేన జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపురెడ్డి సోమేశ్వరరావు పాల్గొన్నారు.