కోల్పోయిన ఫించన్లు తిరిగి ఇవ్వాలి: ములకాల జగన్

విజయనగరం జిల్లా: ప్రభుత్వం అనర్హత వేటుతో తొలగించిన అర్హుల ఫించన్లు వెంటనే అమలు చేయాలని జనసేన పార్టీ గజపతినగరం మండల అధ్యక్షులు ములకాల జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పేదలందరకి సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామని పేపర్లు, టీవీల్లో ఆర్భాటం చేయడం తప్ప వాస్తవానికి ఇక్కడ ఉన్న నాయకులు, ఉన్న పథకాలు తగ్గించేస్తున్నారని, పింఛన్లు జనవరి నుండి పెంచుతామని చెప్పి, అర్హులైన వారికి పింఛన్లు, సంక్షేమ పథకాలు కోత విధించడం ఎంతవరకూ సమంజసం అని.. పింఛన్లు కోల్పోయిన భాదితులకు వెంటనే పింఛన్లు పునరుద్దరించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని, లేనిచో భాదితులు తరుపున పోరాటం చేస్తామని ములకాల జగన్ అన్నారు.