పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 3వ రోజు
నాగర్ కర్నూల్ నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా అనే కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమై ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించడం జరుగుతుంది. మొదటి విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం, తెలకపల్లి మండలం, రాకొండ గ్రామంలో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 3వరోజు నిర్వహించడం జరిగింది. రాకొండ గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ గడప గడపకు పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు గోపాస్ కుర్మన్న, గోపాస్ రమేష్, నారముళ్ళ రవీందర్, దేశమోనేని రాజేష్, సూర్య, లింగం నాయక్, ఆంజనేయులు, అంజి, శ్రీధర్, సిద్దు, మరియు రాకోండ గ్రామ జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-28-at-21.50.27-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-28-at-21.50.28-2-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-28-at-21.50.28-1-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-28-at-21.50.28-1024x580.jpeg)