ట్రాక్టర్ ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎంపీటీసీ విక్రమ్

ఆముదాలవలస: జనసేన పార్టీ నాయకులు ఎంపీటీసీ విక్రమ్ ట్రాక్టర్ ప్రమాద బాదితుడైన పీరుకట్ల రామును పరామర్శించారు. విషయంలోనికి వెళితే పీరుకట్ల రాము గడ్డి ట్రాక్టర్ తో వెళుతుండగా అగ్రికల్చర్ లైన్(ఏ.జి.ఎల్) వైర్ ట్రాక్టర్ కు తగిలి మంటలు చుట్టు ముట్టాయి.. అది గమనించిన అప్పల నాయుడు అనే యువకుడు చాక చక్యంగా డ్రైవ్ చేసి ప్రమాదం నుంచి రక్షించారు. అనంతరం పిల్ల కృష్ణ మరియు మల్లేశ్వరావు తన మోటార్ నుంచి నీరు అందించి ప్రమాదం నుంచి పూర్తిగా రక్షించారు.. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు ఎంపీటీసీ విక్రమ్ సంఘటనా స్థలానికి వెళ్ళి ఈ సంఘటనలో సాయం చేసి ప్రమాదం నుంచి తప్పించిన చీడివలస గ్రామ ప్రజలకు, ముఖ్యంగా బూరి బాస్కరరావుకు ధన్యవాదాలు తెలిపి, వైర్ త్రెడ్ ట్రాక్టర్ తగలడం వలన పడిపోడానికి అవకాశం ఉందని గమనించి ఎలక్ట్రికల్ ఏ.ఈ కి మరియు సిబ్బందికి సమాచారం ఇచ్చి వెంటనే పరిష్కారం చేయమని పిర్యాదు చేయడం జరిగింది.