విశాఖ పర్యటనలో సీ.ఎం మాట్లాడిన మాటలు పిరికిపంద చర్య: వబ్బిన శ్రీకాంత్

పెందుర్తి నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్థన శ్రీకాంత్ మాట్లాడుతూ శుక్రవారం ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చేసి నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయి, ముఖ్యమంత్రి హోదాను దిగజార్చి ఆంధ్రప్రదేశ్ పరువు తీసినట్లుగా మాట్లాడటం జరిగింది, ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికను వివరించకుండా, రాష్త్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అని చెప్పకుండా దత్తపుత్రుడు, భార్యల కోసం మాట్లాడదాన్ని పిరికి పందచర్యగా అభివర్ణిస్తూ.. నేడు జగన్ రెడ్డి గారి కుటుంబంలో చూసుకుంటే వాళ్ళ తాతగారు రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, వాళ్ల సోదరి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అంటే.. ఈ నానమ్మా కాకపోతే ఇంకొక నానమ్మ, ఈ బావ కాకపోతే ఇంకొక బావ లా మీ కుటుంబంలో ఉంది, ఈరోజు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాలను చూస్తే ఒక సినిమాకి ఎంత సంపాదిస్తారు, ఒక యాడ్ కి ఎంత సంపాదించగలరో, ఆయన అపాయింట్మెంట్ కోసం నీ వైఎస్ఆర్సిపి మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు తిరుగుతూ ఉంటారో నీ పక్కన ఉన్న సలహాదారులను అడిగి తెలుసుకో.. ఆయన ప్రభుత్వానికి ఎంత టాక్స్ కడుతున్నారు అలాంటి వ్యక్తిని ఈరోజు నీ రాజకీయ ఉన్నతి కోసం ఈ విధంగా మాట్లాడడం ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి, ఈరోజు మీరు ప్రభుత్వ డబ్బుతో ఏర్పాటుచేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏటువంటి ప్రణాళికలు వేస్తున్నాం, యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా కలిపిస్తున్నావు ఇలాంటివి వివరించకుండా ఎన్నికల ప్రచారంగా ప్రభుత్వ సభలు ఏర్పాటు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, మీరు పారదాలు లేకుండా బయట తిరగలేరు.. మీరు పర్యటించిన ప్రదేశాల్లో ముందస్తుగా ప్రతిపక్ష నాయకులను, ప్రశ్నించిన ప్రజలను ఇంట్లో నిర్బంధించకుండా తిరగలేరు.. మీరు ప్రజానాయకుడు కాదు చెత్త కి పన్ను వేసిన చెత్త నాయకుడిగా పరిపాలన చేస్తున్నావు, ఈరోజు రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన వైద్యం లేదు, నాణ్యమైన ఇల్లు లేదు, యువతకు 3 సంవత్సరాలు గడిచింది జాబు క్యాలెండర్స్ లేవు, ఇలా చెప్పుకుంటే నీ ప్రభుత్వంలో ఎన్నో లోపాలున్నాయి బటన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనక్కి వెళ్ళిపోయింది, చరిత్ర చూసుకుంటే నీ కన్నా గొప్ప గొప్ప నాయకులే ప్రభుత్వ చెత్త పాలన వలన ఈరోజు ఇంటికి పరిమితమై ఉన్నారు, మీ నాన్నగారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు సూట్ కేస్ కంపెనీలను ప్రారంభించే నీవు ఆర్థికంగా ఎదిగావు, ఈనాడు ముఖ్యమంత్రికి మద్యం వ్యాపారం చేసే లక్షల కోట్లు సంపాదిస్తున్నావు, వీటన్నిటినీ ప్రజలు చూస్తున్నారు, ఈరోజు నీవు మాట్లాడిన మాటలు ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రజాధరణ ఓర్వలేక, ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న జనసేన పార్టీ అభివృద్ధిని ఓర్వలేక, ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని అగర్వ పరిచే లా మహిళల కోసం, వ్యక్తిగత విషయాల కోసం, ప్రజాసభ ను ఉపయోగిస్తున్నావు, తప్పకుండా రాబోయే రోజుల్లో మిమ్మల్ని గద్ధి దింపి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారినీ ఓటుతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని శ్రీకాంత్ అన్నారు.