వంగ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 7వ రోజు

• మార్పు కోరుకుంటున్న ప్రజలు.
• జనసేన పార్టీ వైపు ఆసక్తి చూపుతు.
• రాజకీయాల్లోకి కొత్త వాళ్ళు రావాలి, పాలన మారాలి అని కోరుకుంటున్న ప్రజలు.
• మంచి వ్యక్తిత్వం ఉన్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రజలు నోట వ్యక్తపరచడం జరిగింది.

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా అనే కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమై ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించడం జరుగుతుంది. మొదటి విడత కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం, తెలకపల్లి మండలం, ఆలేర్ గ్రామంలో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 7వ రోజు నిర్వహించడం జరిగింది. కామ్ రెడ్డిపల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ గడప గడపకు పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. మరియు మంగళవారం సాయంత్రం నాగర్ కర్నూల్ నియోజకవర్గం బోప్పల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్రగా గడప గడపకు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు, ఎండి మహబూబ్ మరియు నాగర్ కర్నూల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు గోపాస్ కుర్మన్న, నారముళ్ళ రవీందర్, దేశమొని రాజేష్, గోపాస్ రమేష్, కొడిగంటి సాయి కుమార్, ఎస్.పి.సూర్య నాయక్, జెర్రిపాటి చంద్రశేఖర్ సూర్య, సత్యం, రాము, పరశరాముడు, లింగం నాయక్, వంశీ, ఎ.శ్రీధర్, శివాజీ, ప్రశాంత్, శివ, శేఖర్, రవి యాదవ్, చందు, బాలు, ఆదిత్య మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.