మండపేట: అంబరాన్నంటిన జనసేన నూతన సంవత్సర సంబరాలు

  • జనసైనికుల సందడి…
  • లీలాకృష్ణ ఇంట సంబరాలు…
  • అధిక సంఖ్యలో హాజరైన కార్యకర్తలు…

మండపేట: మండపేట నియోజకవర్గ జనసైనికులు ఆదివారం నూతన సంవత్సర వేడుకల సందడి సృష్టించారు. మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ ఇంటికి భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. కపీలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలోని లీలాకృష్ణ స్వగృహంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి వేగుళ్ళ లీలాకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేసి ఆయనను పూలమాలలతో ముంచెత్తారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులు లీలాకృష్ణను శాలువాలతో ఘనంగా సత్కరించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ జనసైనికులు తనను ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన ఎప్పుడు ముందుంటుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. రైతులకు అండగా ఉండి వారి కోసం తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా దశలవారీ ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పలు సామాజిక వర్గాలకు నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, మెగా ఫ్యామిలీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.