యువ శక్తి పోస్టర్ లను ఆవిష్కరించిన పెదపూడి విజయ్ కుమార్

మంగళవారం కాకినాడ సిద్ధార్థ నగర్ లో గల జనసేన పార్టీ ఆఫీసు లో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని తెలిపారు. అలాగే దళిత బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి నేను అండగా ఉంటానని చెప్పి ఈ రోజున ముఖం చాటు వేశాడని ఆయన దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజలను పవన్ కళ్యాణ్ ఆదరిస్తున్నారని అందరం ఈ కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమం వివరాలతో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ తయారు చేసిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు. రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివ దత్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చెప్పారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి మంత్రులు, ఆయన నియమించిన సలహాదారులు పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల కోసం తన పనులు తాను చేసుకుంటూ వెళ్తున్నారని స్వామి వివేకానంద స్ఫూర్తితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ యువతకి ఉద్యోగ అవకాశాలు అలాగే వారిని చైతన్య పరచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోక కాకినాడ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, కాకినాడ సిటీ ఐ.టీ. కో ఆర్డినేటర్ వరప్రసాద్ ఎలుచూరి, కాకినాడ సిటీ సెక్రెటరీ ముత్యాల దుర్గాప్రసాద్, సహాయ కార్యదర్శి కంట రవి, దారపు సతీష్, పచ్చిపాల మధు, వీర మహిళలు మరియ, బట్టు లీల తదితరులు పాల్గొన్నారు.