వరద సాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లొద్దు.. నేరుగా ఖాతాల్లోకే

హైదరాబాద్‌ నగరంలో వరద బాధితులెవరూ మీ సేవ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అందించే ఆర్థికసాయాన్ని నేరుగా బాధితుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. బాధితుల వివరాల ధ్రువీకరణ పూర్తి అయ్యాక ఈ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. వరద సాయం కోసం బాధితులెవరూ మీ-సేవ సెంటర్ల చుట్టూ తిరగొద్దని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి సాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బాధితుల వివరాలు, ఆధార్‌ నంబర్‌ ధ్రువీకరణ జరుగుతోందని కమిషనర్ వివరించారు.