ధారావత్ సునీత కుటుంబానికి అండగా నిలిచిన జనసేన పార్టీ

హైదరాబాద్, జనసేన పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ ఆకుల సుమన్ ఆదేశాల మేరకు భూపాలపల్లి నియోజకవర్గం సుభాష్ కాలనీకి చెందిన ధారావత్ సునీత చిన్న వయసులోనే భర్తను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జనసేన పార్టీ దృష్టికి రావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు బైరి వంశీకృష్ణ మరియు పాలకుర్తి నియోజకవర్గం నాయకులు వెల్తూరి నాగేష్, స్వయంగా భూపాలపల్లికి వెళ్లి వారిని కలిసి సమస్యలు తెలుసుకొని వారి పిల్లల చదువుల గురించి చైతన్య స్కూల్లో మాట్లాడి పిల్లల పరీక్షలకి ఎలాంటి ఆటంకం కలగకుండా సంబంధిత ఫీజులు ఉమ్మడి వరంగల్ జనసేన పార్టీ చూసుకుంటుందని స్కూల్ ప్రిన్సిపాల్ కి తెలియజేయడం జరిగింది. మరియు సునీతకి జనసేన పార్టీ అండగా ఉండి ఉద్యోగం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు మరియు వారికి ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం కేటాయించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లును కూడా సునీతకి వచ్చే విధంగా జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ నాయకులు జెర్రిపోతుల సనత్ కుమార్ సిద్ధము రవి, కాటారం మండల నాయకులు జనగాం పవన్, సురేష్ పాల్గొన్నారు.