పొన్నూరు జనసేనలో చేరిన యువత

పొన్నూరు నియోజకవర్గం, పొన్నూరు మండలం, ఉప్పరపాలెం, ములుకుదురు గ్రామాల నుంచి గోవాడ మురళి, నాగిశెట్టి సుబ్బారావుల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు యువతని పార్టీ కండువాలు మెడలో వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాదుతూ… ఈరోజు పొన్నూరు నియోజవర్గంలో యువత జనసేన పార్టీపై నమ్మకంతో పార్టీలోకి చేరటం చాలా సంతోషకరం. ఇలానే భవిష్యత్తులో పొన్నూరు నియోజవర్గం జనసేన అడ్డాగా మారాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. భవిష్యత్తు రాజకీయం జనసేన పార్టీ చేతుల్లోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో జిల్లా కమిటీ సభ్యులు కానీ మండల అధ్యక్షులు గాని అలాగే నగర అధ్యక్షులు గాని అందరు కలిసికట్టుగా ఇలానే పనిచేస్తూ నూతన రక్తాన్ని మన పార్టీలోకి ఆహ్వానించే దిశగా పయనించాలని కోరుచున్నాము. అలాగే రేపు జరగబోయే యువశక్తి భారీ బహిరంగ సభకు పొన్నూరు నియోజకవర్గం నుంచి అందరూ తరలిరావాలని మన అధ్యక్షులు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మనం జనంలోకి తీసుకువెళ్లి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. అనంతరం యువశక్తి పోస్టర్ ని అందరి సమక్షంలో విడుదల చేయటం జరిగింది. నూతనంగా పార్టీలోకి చేరిన వారు అనిల్ కుమార్, మహేష్ సూరిశెట్టి, వల్లంసెట్టి అనిల్, గోవాడ అజయ్, గుర్రంకొండ పాపారావు, పవన్, ఆవుల గోపి, రంజిత్ కుమార్, చిరంజీవి గోవడా, చలపతి, మని గోపాల్, అబ్దుల్, రహిమ్, శుభాని తదితరులు వీరి అందరికి పార్టీ తరుపున ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలువుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, మేకల రామయ్య యాదవ్, తాళ్లూరి అప్పారావు, దేసంశెట్టి సూర్యచంద్రరావు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, పొన్నూరు పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.