యువ శక్తి ప్రోగ్రాం ను జయప్రదం చేయండి

శనివారం చీపురుపల్లి మండల పార్టీ ఆఫీసులో యువశక్తి చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు వహించిన ముత్తా శశిధర్ సమక్షం లో చీపురుపల్లి మండల అధ్యక్షులు విసినిగిరి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం యువ శక్తి ప్రోగ్రాం ను జయప్రదం చేయాలని కోరారు. అందుకు కాను చీపురుపల్లి నుండి 150 ఆటోలు మరియు 500 బైకులతో భారీగా ర్యాలీగా రణస్థలం సభకు వెళ్లాలని నిర్ణయించారు. సుమారు 50వేల మంది చీపురుపల్లి నియోజకవర్గం నుండి సభకు వెళ్ళడానికి సిద్దంగా తగు ఏర్పాటు చేస్తున్నారు. చీపురుపల్లి నుండి 10000 మంది హాజరవతారు అని విశినిగిరి శ్రీనివాసరావు చెప్పారు. తుమ్మగంటీ సూరినాయుడు, పెద్ది వెంకటేష్ గరివిడి మండల అధ్యక్షులు తన బాధ్యతగా 20 టాటా ఏసీ లు గరివిడి మండలం నుండి 200వందలు బైకులు పాల్గొంటాయి అని చెప్పారు. గుర్ల మండల అధ్యక్షులు యడ్ల సంతోష్ కుమార్, దంతులూరి రామ రాజు 150 ఆటోలు 200 బైకులు పాల్గొంటాయి. మెరకముడిదాం మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణి, రేగిడి లక్ష్మణరావు విజయనగరం జిల్లా నాయకులు 150 ఆటోలు 200 బైకులు పాల్గొంటాయి అని చెప్పారు.