యువశక్తి రేపటి తరానికి ఆశాజ్యోతి

  • యువశక్తి కార్యక్రమ సమాయాత్త సమావేశం

గజపతినగరం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదిన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న యువశక్తి కార్యక్రమ సమాయాత్త సమావేశం గజపతినగరం నియోజకవర్గం, బొండపల్లి మండలంలో నాయుడు ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా జరిగినది. ఈ కార్యక్రమమునకు గజపతినగరం నియోజకవర్గం సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా యువశక్తి ప్రచార కర్త బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని అధ్యక్షుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు యువకుల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడో వివరిస్తూ జనవరి 12వ తేదీ వివేకానందుని జన్మదినం రోజు జరుగు కార్యక్రమానికి ఆహ్వానిస్తూ దిశా నిర్దేశం చేశారు.. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అభినవ వివేకానందుడిగా అభివర్ణించారు, మర్రాపు సురేష్ మాట్లాడుతూ యువశక్తి కార్యక్రమానికి సంబంధించి గజపతినగరం నియోజకవర్గంలో ప్రతి పల్లి పల్లెకు యువశక్తి ఆవశ్యతను వివరిస్తూ ఆటో ద్వారా ప్రచారం చేస్తున్నామని, అలాగే ఐదు మండలాల్లో ప్రధాన కూడినలో వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, కర్ర పత్రాలు ద్వారా యువకుల్ని చైతన్య పరుస్తున్నామని, యువశక్తి కార్యక్రమానికి గజపతినగరం నుంచి అధిక సంఖ్యలో నాయకులు యువకులు, వీరమహిళలు పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి పాలవలసస్విని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాబు పాలూరి రాష్ట్ర కార్యనిర్వాన కార్యదర్శి, వీరమహిళ దుర్గా, జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, మండల అధ్యక్షులు అప్పలరాజు, జగన్, అప్పారావు, ముఖ్య నాయకులు హరీష్, పండు, శ్రీను, ఆదినారాయణ, మహేష్, చంటి, వీర మహిళలు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.