యర్రగొండపాలెం ఆత్మీయ సమావేశం

ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గం ఇంచార్జి డా.పాకనాటి గౌతమ్ రాజు ఆదేశాల మేరకు నియోజకవర్గం కేంద్రంలోని శ్రీ మంజునాథ పంక్షన్ హాలు నందు జనసేన పార్టీ ఆత్మీయ సమావేసం చేయటం జరిగింది. రాబోయ్యే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని సీఎం చేయటం కొరకు ప్రతి యొక్క జనసైనికుడు కృషిచేయాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి భిమిసెట్టీ వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా కార్యదర్శి పాతకోటి వెంకట సుబ్బారావు, పుల్లలచెరువు మండల అధ్యక్షుడు కోటారు అచయ్య, మరియు జనసైనికులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.