యు.పి.రాజు ఆధ్వర్యంలో యువశక్తి కరపత్రాల పంపిణీ

రాజాం నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన జరగబోయే యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనని సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నందు ప్రయాణికులకు, విద్యార్థులకు, యువతకు కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా యు.పి.రాజు మాట్లాడుతూ యువత సమస్యలపై పోరాడిందుకే ఈ యువశక్తి బహిరంగ సభ రణస్థలంలో చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ యువశక్తి కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్లె గోవిందరావు, వెంకట్రావు, ఈశ్వర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.