యువశక్తి సభకు గుంటూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో సభకు హాజరవ్వాలని కోరిన గాదె వెంకటేశ్వరరావు

సోమవారం జిల్లా కమిటీ మరియు మండల అధ్యక్షుల సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. రేపు శ్రీకాకుళంలో జరగబోయే రణస్థలంలో యువభేరి భారీ బహిరంగ సభకు మన జిల్లా నుంచి అధిక సంఖ్యలో సభకు హాజరవ్వాలని కోరడం జరిగింది. అలాగే నియోజకవర్గం నుంచి ఎవరెవరు ఎలా వస్తున్నారో కనుక్కొని వారికి తగు ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేయాలని అందరి అభిప్రాయం తీసుకొని ముందుకు సాగాలని తెలియజేయడం జరిగింది.