వివాహబంధంలోనికి అడుగు పెట్టిన నితిన్, షాలినిలు

యువ హీరో నితిన్, షాలినిలు వివాహబంధంతో ఒక్కటయ్యారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆనందోత్సహాల మధ్య నితిన్, షాలినిల పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల్లో అతి ముఖ్యులైన వారు వివాహానికి హాజరయ్యారు.

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో యువ హీరో నితిన్ పెళ్లిని ఘనంగా కుటుంబ కార్యక్రమంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి (జూలై 26వ తేదీ రాత్రి) 8.30 నిమిషాలకు ప్రతిష్టాత్మకమైన తాజ్ ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిపించారు. ఇరు కుటుంబాల సభ్యులు ఈ పెళ్లికి హాజరయ్యారు.

వేదపండితుల మంత్రాల మధ్య నితిన్, షాలిని నవదంపతులు సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో ధగధగమెరిసిపోయారు. హిందూ సంప్రదాయ పద్దతిలో వేద పండితుల వేద మంత్రాల నడుమ నిర్ణయించిన సుముహుర్దానికే నితిన్ షాలిని మెడలో మూడు మూళ్లు వేశారు. దాంతో నితిన్, షాలిని ఒక్కటయ్యారు.

సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు అమెరికాకు చెందిన, ఎన్నారై యువతి షాలినితో ప్రేమ పెళ్లిగా జరిగిన కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలు హాజరై  నవదంపతులకు దీవెనలు అందించారు. నితిన్ పెళ్లికి హాజరైన యువ హీరోల్లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ తదితరులు ఉన్నారు.