యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: బొబ్బేపల్లి సురేష్
సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు మంగళవారం ముత్తుకూరు మండలంలో యువశక్తి కార్యక్రమ ప్రచారంలో భాగంగా యువశక్తి పోస్టర్ను ఆవిష్కరించి, కార్యక్రమం గురించి యువకులకి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ జనవరి 12వ తారీకు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో చేపట్టబోయే యువశక్తి కార్యక్రమం యువత యొక్క ఆలోచనలు స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో యువత కి కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి, యువత యొక్క ఆలోచనలని వ్యక్తపరిచే విధంగా జరగబోయే యువశక్తి కార్యక్రమంలో వేలాదిగా యువత పాల్గొనాలని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రహమాన్ శ్రీహరి యువత పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-10-at-6.38.24-PM-1-1024x576.jpeg)