చట్టం అందరికీ ఒకేలాగ ఉండాలి: పార్వతి

కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం జనసేన వీరమహిళ పార్వతి మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 1ను అతిక్రమిస్తూ సోమవారం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని నియోజకవర్గాల్లో రోడ్లపై అధికార పార్టీ నాయకులు డీజేలు, బాణాసంచాలతో సంబరాల కార్యక్రమాలను నిర్వహించి, రోడ్లపై ర్యాలీలను చేశారు. అధికార పార్టీ కార్యక్రమాలు కాబట్టి జీవోను ఉల్లంఘిస్తూన్నారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలి,. అధికార పార్టీ నాయకులకు ఒకలా, ఇతరుల పార్టీలకు ఇంకొకలా ఉండరాదు. వైసీపీ గడప గడప కార్యక్రమం కూడా వీధుల్లో నిర్వహించాల్సి ఉంటుంది. గడప గడప కార్యక్రమాన్ని రద్దు చేసి ఆ తర్వాత జీవో నెంబర్ 1.ను తీసుకురావాలని పార్వతి అన్నారు.