హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో యువశక్తి ప్రచారం

విజయనగరం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, రణస్థలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమ చివరి రోజు ప్రచారం జనసేన యువ నాయకుడు హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో, విజయనగరంలోని పలు ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా హుస్సేన్ ఖాన్ యువశక్తి కార్యక్రమ కరపత్రాలను యువతకు అందించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు చక్రవర్తి, జనసైనికులు అబ్బాస్, భవాని, నవీన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.