మైనార్టీలకు ఇచ్చిన హామీలను మరచినారా సి.ఎం గారూ: అరటి తాహిర్

తాడిపత్రి: మైనార్టీ నాయకుడు అరటి తాహిర్ మాట్లాడుతూ జగన్ గారు గెలిచి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తోన్నా మైనార్టీ ముస్లింలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఏద్దేవా చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్క్ బోర్డ్ కమిటీ కాదు మనకి కావాల్సినది ముస్లిం మైనరి వర్క్ బోర్డ్ ఆస్తులు రీసర్వ్ చేయించండి అన్నారు. ఓ మైనార్టీ వర్క్ బోర్డ్ కమిటీ ఏర్పాటు చేసిన మహనీయుడా ప్రతి మైనార్టీ ఆడ బిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తా అన్నారుగా.. అయ్యా అది ఎక్కడ..? అని ప్రశ్నించారు. ప్రమాదవశాత్తు మరణించిన ముస్లిం లకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారుగా దాని గురించి పట్టించుకోరా.. మసీదులలో నమాజు చదివించే ఇమాములకు ఇంటి స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం అన్నారు కదా అయ్యా దాని గురించి పూర్తిగా మర్చిపోయారా..? గత ప్రభుత్వంలో చిన్నాచిత చేసుకుంటే వ్యాపారులకు సబ్సిడీ లోన్స్ మైనార్టీ కార్పొరేషన్ నుంచి వచ్చేవి అవి కూడా లేకుండా చేశారు కదా..! ఈ సందర్భంగా వైసీపీ పార్టీ లో ఉన్న మైనార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా దయచేసి మైనార్టీలకు ఇచ్చిన హామీలు గురించి సి.ఎం గారికి గుర్తు చేయండి అని తాహిర్ అన్నారు.