యువశక్తి సభతో వైసీపీ వెన్నులో వణుకు మొదలైంది: కాశెట్టి సంజీవ రాయుడు

అనంతపురం: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర వలసలు, నిరుద్యోగ సమస్యలపై తలపెట్టిన యువశక్తి సభ పెద్దయెత్తున విజయవంతం కావడంతో వైసీపీ నాయకులు వెన్నులో వణుకు మొదలైందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు పేర్కొన్నారు. సభ విజయవంతం కావడం వల్ల వైసీపీ నాయకులకు భయం పుట్టి అవాకులు వాగుతున్నారని కాశెట్టి మండి పడ్డారు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, వైసీపీ నాయకులు ఇక రోజులు లెక్కపెట్టుకోవాలని సూచించారు. నిరంకుశత్వ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రాబోయేది జనసేన ప్రభుత్వమేనని రాష్ట్ర అభివృద్ధి జనసేన పార్టీ కట్టుబడి ఉందని నిరుద్యోగం, పేదరికం, వలసలు తగ్గలన్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడాలన్న ఒక్క జనసేన తోనే సాధ్యమని సంజీవరాయుడు తెలియజేశారు.