కొండగట్టు యాత్రను విజయవంతం చేయండి: మూల హరీష్ గౌడ్

రామగుండము: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కొండగట్టు యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ నాయకుడు రామగుండం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ మూల హరీష్ గౌడ్ కోరారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 24 మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జనసేన ఎన్నికల ప్రచార రథం వారహి పూజా కార్యక్రమం నిర్వహించి, ఆ తర్వాత జగిత్యాల జిల్లా లోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో దర్శనం చేసుకుంటారు అని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి జనసైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మూల హరీష్ కోరారు.