పాసాలమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న బత్తుల

  • అత్యంత వైభవంగా పాసాలమ్మ జాతర..
  • అమ్మవారిని దర్శించి, తీర్ధప్రసాదాలు స్వీకరించిన బత్తుల

రాజానగరం: కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో పాసాలమ్మ జాతర మహోత్సవంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పాల్గొని.. అమ్మవారి రథాన్ని లాగి కార్యక్రమాన్ని ప్రారంభించరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండి.. కాపవరం గ్రామస్తులు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని బలరామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో అమ్మవారి కమిటీ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, కోరుకొండ మండల జనసేన నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.