ఒంటిమిట్టలో దిగ్విజయంగా 51వ రోజు పవనన్న ప్రజాబాట

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న ఆశయ సాధనతో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం 51వ రోజు దిగ్విజయంగా కొనసాగింది. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు శుక్రవారం ఒంటిమిట్ట మండలం పరిధిలోని రాచపల్లి పంచాయతీ సీతాపురం గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు పార్టీ సిద్ధాంతాలు ఆశయాలతోపాటు జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయనున్న మేనిఫెస్టోను వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ, జనసేన పార్టీకి అండగా నిలిచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. జనసేన తోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.