ఛలో కొండగట్టు పోస్టర్స్ ఆవిష్కరణ

  • తెలంగాణ జనసేన రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఛలో కొండగట్టు పోస్టర్స్ ఆవిష్కరణ

హైదరాబాద్: జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం వారహికి జనవరి 24న తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వారాహి వాహనానికి సంప్రదాయ పూజలు చేయించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.. ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ కేంద్ర కార్యాలయం (హైదరాబాద్) లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి చేతుల మీదగా ఛలో కొండగట్టు పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నెమురి శంకర్ గౌడ్, జిహెచ్ఎంసీ అధ్యక్షులు రాధరాం రాజలింగం, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్, సురేష్ రెడ్డి, గోకుల రవీందర్ రెడ్డి మరియు జిహెచ్ఎంసీ ముఖ్య నాయకులు, పార్టీ వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.