నేతాజీ స్ఫూర్తిని నవతరం అందిపుచ్చుకోవాలి

దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం ప్రతి తరాన్నీ జాగృతం చేస్తుంది. వర్తమానంలో వారి జీవిత గమనానికి నేతాజీ పోరాటం మార్గనిర్దేశనం చేస్తుంది. నేతాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సభక్తికంగా అంజలి ఘటిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకమవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరికివారవుతారు’ అని ఉత్తేజితం చేసిన ఆ యోధుని స్ఫూర్తి వచనాలను నవతరం అందిపుచ్చుకోవాలి. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై గొంతు వినిపించడంలో అధైర్యం వదిలి మాట్లాడిన రోజున కచ్చితంగా పాలకుల వైఖరి మారుతుంది. నవతరంలో సామాజిక స్పృహను పెంపొందించేందుకు జనసేన చేపట్టే కార్యక్రమాలపై నేతాజీ ఆలోచనల ప్రభావం ఎప్పుడూ ఉంటుందని పవన్ కళ్యాణ్ వివరించారు.