91వ వార్డ్ పాత గోపాలపట్నంలో జనసేనాని యాత్ర కోసం పూజలు
పశ్చిమ నియోజకవర్గం 91వ వార్డ్ జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రధానికి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహిస్తున్న సందర్భంగా పాత గోపాలపట్నం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు, నిమ్మకాయలతో అభిషేకం చేయడం జరిగింది. జనసైనికులు, వీరమహిళలు అందరి అభీష్టం ఒకటే రాబోయే ఎన్నికల్లో పార్టీ అభిమానులకు ఉత్సాహాన్నిస్తూ పార్టీ వారినీ సామాన్య ప్రజానీకానికి మరింత చేరువై తిరుగులేని ఆధిపత్యంతో పార్టీని, పార్టీ అభ్యర్థులను గెలిపించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఆదర్శ నాయకుడు గా నిలబడాలని, ఆ ఆంజనేయ స్వామి తమ అభీష్ఠాన్ని నెరవేర్చాలని ఆకాంక్ష. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఉండే వార్డ్ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-24-at-20.04.41-1024x461.jpeg)