మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు..

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం జనసేన పార్టీ కార్యాలయం నందు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ చేతుల మీదుగా జెండాఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఆడపడుచు & జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ స్కూల్ పిల్లలకి బుక్స్ &పెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండలం కో-కన్వీనర్ ముక్క రాంబాబు, రాయపాటి హరీష్, ఆదిత్య, తెలగంశెట్టి శివ, తన్నీరు తాతాజీ, గొల్లకోటి కృష్ణ, మండపాక మురళి, రచపోతుల సతీష్, చల్లా ప్రసాద్ జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.