గణతంత్ర దినోత్సవ వేడుకలలో దర్శి జనసేన

  • జనసేన ఆధ్వర్యంలో భవిత కేంద్రంలో లంచ్‌ బాక్సుల పంపిణీ

దర్శి: భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా, దర్శి పట్టణంలోని భవిత కేంద్రంలో బధిర విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం లంచ్‌ బాక్సులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామ్‌ కమిటీ సభ్యులు మరియు పడమర గంగవరం వార్డు సభ్యులు పసుపులేటి చిరంజీవి మాట్లాడుతూ బధిర విద్యార్థుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆట స్థలం లాంటి అనువైన సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యార్థుల ఆలనా పాలన చూసే ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో దర్శి ఐటి కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య పార్టీ దర్శి పట్టణ అధ్యక్షులు చాతరాశి కొండయ్య, నియోజకవర్గ నాయకులు పుప్పాల పాపారావు, ఉల్లి వెంకటేష్, ఎస్ కే వెంకటేష్, ఎస్.కే భాష, ఇనుగమూరి అంకిరెడ్డి, కురంగి శ్రీనివాసులు, కోవెలకుంట్ల శ్రీకాంత్, పుప్పాల శ్రీకాంత్, దివ్యాంగుల విద్యార్థుల తల్లిదండ్రులు, రిసోర్స్ ఉపాధ్యాయులు జి సుబ్రమణ్యం, ఎం శ్రీనివాసులు, ఆయా లీలావతి పాల్గొన్నారు. దివ్యాంగుల విద్యార్థులకు బాక్సులు పంపిణీ చేసిన జనసేన పార్టీ కార్యకర్తలకు భవిత సిబ్బంది అభినందించడం జరిగినది.