సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగంపై అవగాహనా సదస్సులో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ పై రాష్ట్ర స్థాయి సదస్సులో అనేకమంది ఎస్సి, ఎస్టి పెద్దలు, మేధావులతో సమావేశం అయ్యి వారికి జరుగుతున్న అన్యాయంపై వివరాలతో మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగా ఆదివారం కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ అధ్యక్షతన ఎస్సి, ఎస్టి సోదరులు, మహిళలు యువతతో జరిగిన సమావేశానికి ముఖ్య అతిధులుగా పాల్గొని ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు ఈ వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది అని, మీ అభివృద్ధికి కేటాయించిన నిధులు వేరే వాటికీ మళ్ళించి మీకు అన్యాయం చేస్తున్నారని, యువత వీటిపై పూర్తి అవగాహన కల్పించుకుని అందరికి వివరాలు తెలియచేయాలనీ, వైసీపీ ప్రభుత్వం సుమారు 21500/- కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తెలిపారు. అనంతరం కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో ఎస్సి పేటలో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గరగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి వారికి ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు వివరాలు వారికి తెలియచేసి, వారినుండి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.