యువత ఉపాధి అవకాశాలను వైసీపీ దూరం చేసింది.. లోకం మాధవి ధ్వజం

నెల్లిమర్ల నియోజకవర్గ నాయకురాలు లోకం మాధవి జనసేన ప్రచార రధం వారాహికి మద్దతుగా మరియు ఫిబ్రవరి 1 నుండి మొదలు కానున్న మన ఊరిలో జనవాణి కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీస్కొని వెళ్లేలా భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ నియోజకవర్గం లోని ప్రతి పంచాయతీకి కమిటీలు నియమించడం జరిగిందని, వీటి వలన పార్టీ భలోపేతానికి కృషి చేస్తాం అని పేర్కొన్నారు. జనవాణి ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో వున్న ప్రజా సమస్యలని తెలుసుకొని వాటికి సాధ్యమైనంత వరకు పరిష్కార దిశగా అడుగులు వేస్తాం అని తెలియజేసారు. ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొన్న యువతని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం యువతకి ఉపాధి అవకాశాలను దూరం చేసింది అని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పధకాలు అర్హులు అయిన వారికి చేరట్లేదని, ప్రభుత్వ సానుభూతి పరులకే వర్తిస్తున్నాయి అని విమర్శించారు.