మహాత్ముడు కలలు కన్న స్వరాజ్యం జనసేన తోనే సాకారం..

  • కాశెట్టి సంజీవ రాయుడు, కొండిశెట్టి ప్రవీణ్ కుమార్..

సింగనమల: మహాత్మా గాంధి వర్ధంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి కాసెట్టి సంజీవ రాయుడు, శింగనమల నియోజకవర్గ జనసేన నాయకుడు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ అనంతపురం నగరంలో టవర్ క్లాక్ కూడలిలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సిద్దింప చేసిన నాయకులలో మహాత్మా గాంధీ అగ్రగన్యుడని. సత్యం, అహింస మార్గాలని ఆయుధాలుగా చేసుకుని స్వతంత్ర పోరాటానికై నడుం బిగించి.. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం వంటి అనేక శాంతియుత పోరాటాలను చేసి భారతీయులను స్వతంత్ర ఉద్యమంలో ఏకం చేసి విదేశీ పాలన నుండి దేశానికి స్వతంత్రం సిద్ధింప చేయటానికి విశేషమైన కృషి చేశారని ఆయన గొప్ప సేవలు నేటి యువతకి స్ఫూర్తిదాయకమన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గ్రామ స్వరాజ్యం వైపు నేతలు అడుగులు వేయాలని సూచించిన గొప్ప వ్యక్తి మహాత్మ గాంధీ అని కొనియాడారు.