పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 17వ రోజు కార్యక్రమం

నాగర్ కర్నూల్: మంగళవారం బిజినపల్లి మండలం జగ్గన్న తాండా, ఇప్పల్ తాండాల్లో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. జనసేన నాయకులతో, జనసైనికులతో కలిసి పాదయాత్రగా తాండాల్లో పర్యటించారు. తాండాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ, కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు హారి నాయక్, బోట్క రమేష్, సూర్య, రాజు నాయక్, వంశీ రెడ్డి, లింగం నాయక్, పవన్, శివ, సంతోష్, దీపక్, లోకేష్, అర్. సంతోష్, సాయి కిరణ్, సోముల నాయక్, గణేష్, బాలకృష్ణ, రమేష్, అనిల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.